Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాల ప్రాజెక్టుల మధ్య కేంద్రం చిచ్చు
- ఏర్పాటుకాని ట్రిబ్యునళ్లు
- నిధుల డిపాజిట్కు నోటిఫికేషన్
- అనుమతులు ఇవ్వకుండా కేంద్రం జాప్యం
- దీర్ఘకాలికంగా కొనసాగుతున్న వివాదాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలుగురాష్ట్రాల మధ్య సాగునీటి వివాదాలు రోజురోజుకు తీవ్రమవుతు న్నాయి. పరిష్కరిం చాల్సిన కేంద్ర ప్రభుత్వమే వాటిమధ్య ఆజ్యం పోస్తున్నది. పంచాయితీలను పెంచు తున్నది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014ను అమలుచేయడంలో ఎన్డీయే సర్కారు శ్రద్ధ చూపడం లేదు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలుసైతం తమ రాజకీయ ప్రయోజ నాలు మినహా ప్రజల గురించి ఆలోచించడం లేదు. కేంద్రం అదే ఆలోచనతో వ్యవహరి స్తున్నది. పున ర్విభజన చట్టం ప్రకారం సాగునీటి వివా దాలు, ఇతర సమస్యలను పరిష్కరించడా నికి ట్రైబ్యు నళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు అపెక్స్ కౌన్సిల్, గోదావరి, కృష్జా నదుల యాజమాన్య బోర్డులు ఏర్పాటైనా వివాదాలు కొలిక్కి రావడం లేదు. ఇరు రాష్ట్రాలు ఇంకా ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నాయి. వీటి పంచాయితీని కేంద్రం చూస్తూ నవ్విపోదు రుగాక నాకేటి సిగ్గు అనేలా వ్యవహరి స్తున్నది. దింతో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు దశాద్ధాల తరబడి కొన సాగుతున్నాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. సమస్యలను వివరిస్తూ వినతిపత్రాలు సమర్పించారు. అయినా ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి వివాదాన్ని కేంద్రం కొలిక్కితీసుకురాలేక పోయింది. ఇదిలావుండగా జల వివాదాలు, నిర్మాణ సమస్యలు ఉన్న ప్రాజెక్టులను గోదావరి, కృష్ణా యాజమాన్య బోర్డుల పరిధిలోకి తెచ్చింది. ఏపీలో జగన్మోహన్రెడ్డి సర్కారు అధికారంలోకి రాగానే తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన మంత్రివర్గం సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరిం చే ప్రయత్నం చేశారు. పలుమార్లు ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రుల భేటీలు జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్య దర్శులు, సాగునీటి శాఖ ఉన్నతాధికారుల సమావేశాలు జరిగాయి. అయినా జలవివాదాలు ఇంకా గాడినపడలేదు. సరికదా ఆయా ప్రాజె క్టుల పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనీ, నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలిస్తున్నారని ఇరు రాష్ట్రాలు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్న సంగతీ తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ ద్వారా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉన్నా, ఆ సమావేశాలు మాత్రం తరచూ వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇటీవల గత వారం రోజుల వ్యవధిలోనే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి ఆయా ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలు, వివాదాలపై తెలంగాణ సాగునీటి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ లేఖలు రాయడమే సాక్ష్యం. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84(1) ప్రకారం అపెక్స్ కౌన్సిల్, కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటయ్యాయి. అలాగే అదే చట్టంలోని సెక్షన్ 85 (8) ప్రకారం ట్రిబ్యునల్నూ ఏర్పాటు చేయాలి. ఇప్పటివరకు దానిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇది జలవివాదాల పరిష్కారంలో కేంద్రం అశ్రద్ధను బయటపెడుతున్నది. అలాగే సెక్షన్ 87(1) ప్రకారం కేంద్రానికే సర్వాధికారాలు ఉన్నాయి. సమస్యలు, వివాదాలపై తుది తీర్పులు, ఆదేశాలు ఇచ్చే అధికారమూ కేంద్రమే దగ్గరే ఉన్నా యి. అయినా తెలుగు రాష్ట్రాల్లో నిత్యం రావణకాష్టంలో సాగునీటి వివాదాలు రగులుతున్నా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రాల కు సాధారణంగా రావాల్సి నిధులను ఎగ్గొట్టడంతోపాటు ఎక్కడిక్కడ కోతలు పెడుతున్నది. ఆర్థిక సంఘాల నిధులను ఆలస్యంగా కేటాయిస్తున్నది. నిటిఅయోగ్ సిఫారసులను పెడచెవిన పెట్టింది. ఈ తరుణంలో వివాదమున్న ప్రాజెక్టుల నిర్వహణను గోదావరి, కృష్ణా బోర్డుల పరిధిలోకి తెచ్చింది. అంతేగాక ఆ బోర్డుల నిర్వహణకు అయ్యే ఖర్చుల కోసం రూ. 200కోట్లు కేంద్రం వద్ద డిపాజిట్ చేయాలని గత జులై 15న జారీచేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఇలా రాష్ట్రాలను ఆర్థిక దోపిడిచేయడంతోపాటు సమస్య పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని కనపరచడం లేదు. రాజ్యాంగం ప్రకారం జలవివాదాలు రాష్ట్రాల జాబితాలో ఉన్నా యి. తగాదాల పేరుతో తమ పరిధిలోకి కేంద్రం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం. తెలంగాణ ప్రభుత్వం ఈ సంగతిని చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదు. అంతేగాక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలోనూ జాప్యం చేస్తూ, తగాదాలను పెంచుతుండటం గమనార్హం.