Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది మంది అరెస్ట్.. రూ.22 వేల నగదు స్వాధీనం
నవతెలంగాణ-మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు కొరడా జూలిపిస్తున్నారు. మండలంలోని అంతాపూర్ గ్రామంలో రెండు స్థావరాలపై మంగళవారం ఆకస్మికంగా దాడులు జరపగా ఒక స్థావరంలో ఆరుగురు, రెండో స్థానంలో నలుగురు పేకాట రాయుళ్లను పట్టుకున్నట్టు ఎస్ఐ రాజు తెలిపారు. మొత్తం రూ.22,700 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామనీ, దీపావళి పండుగ వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.