Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం ద్వారా కేంద్రానికి రూ.లక్ష కోట్ల ఆదాయం తగ్గుతుందని తెలిపారు. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకుని పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వ్యాట్ను తగ్గించాలని కోరారు.