Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు దీపావళిని జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే దీపావళి రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారదోలి వెలుగులు నింపే పండుగగా దీపావళిని దేశ ప్రజలు జరుపుకుంటారని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ మరిన్ని ప్రగతి కాంతులు నింపాలని ఆయన ప్రార్థించారు.
మంత్రి సత్యవతి రాథోడ,్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.