Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా పండుగల సీజన్ ప్రారంభమైంది. దీంతో చాలా మంది ప్రయాణికులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు లేదా విహార స్థలాలను చూసేందుకు టిక్కెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. దేశంలోనే ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ బ్రాండ్ సంస్థ గోయిబిబో.. రాబోయే నెలల్లో అన్ని ట్రావెల్ మోడ్ల ద్వారా ప్రయాణ బుకింగ్ల్లో పెరుగుదలను గమనించింది.
ప్రయాణీకుల రద్దీ తిరిగి పెరిగిన నేపథ్యంలో, గోయిబిబో ఫ్లైట్ బుకర్ల కోసం ప్రైస్ లాక్తో సహా కొత్త ఫీచర్ల శ్రేణిని మొదలుపెట్టింది. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో రైలు బుకర్ల కోసం గో కన్ఫర్మ్డ్ టికెట్తో పాటు ప్రయాణాన్ని ప్లాన్ చేసేటప్పుడు, బుకింగ్ చేసేటప్పుడు స్మార్ట్ ఎంపికలు, విలువ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో వినియోగదారులకు సహాయం చేస్తున్నది.
గో కన్ఫర్మ్డ్ టిక్కెట్ అనేది చాలా విశేషమైనది. ఇందులో ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. రైలు ప్రయాణాన్ని బుక్ చేసేటప్పుడు వినియోగదారులకు మరిన్ని ఎంపికలు, సౌలభ్యం, పెరిగిన విలువను అందించడానికి వీలుగా ఒక అద్భుతమైన ఫీచర్ గా దీన్ని రూపొందించారు. చార్ట్ ప్రిపర్ అయిన తర్వాత ఒకవేళ రైలు టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో విమాన, క్యాబ్ లేదా బస్సు టిక్కెట్ల కోసం చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ప్రయాణ, ఫైనాన్సింగ్ ఎంపికలను కనుగొనడానికి బుక్ చేసుకోవడానికి ఈ ఫీచర్ ప్రయాణికులకు ఉపయోగపడుతున్నది. దీన్ని ఎంచుకోవడం ద్వారా, రైలు బుకర్లు ధృవీకరించని టిక్కెట్కు తిరిగి గ్యారెంటీ విలువను పొందే వీలుంది. అంతే కాకుండా భవిష్యత్ తేదీ కోసం ఫ్లైట్, క్యాబ్, బస్సు లేదా ప్రత్యామ్నాయ రైలు ప్రయాణం ద్వారా తాజా బుకింగ్ ను అప్గ్రేడ్ చేసి ప్రత్యామ్నాయంగా మార్చుకోవచ్చు.
ఈ సందర్భంగా రూపొందించిన కొత్త ఫీచర్లపై గోయిబిబో గ్రౌండ్ ట్రాన్స్ పోర్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పరీక్షిత్ చౌదరి మాట్లాడుతూ ''గోయిబిబోలో.. ప్రయాణ సౌకర్యాలను అభివద్ధి చేయడమే మా నిరంతర లక్ష్యం. దీంతో పాటు స్మార్ట్ ట్రావెల్ కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడంలో మా ప్రయాణికులకు సహాయం చేయడం చుట్టూ కేంద్రీకృతమై ఉన్న పరిష్కారాలు రూపొందించడమే మా పని.
ఇప్పుడు గోకన్ఫర్మ్డ్ టిక్కెట్ అనేది రైలు వినియోగదారులకు మరిన్ని ప్రయాణ ఎంపికలు, సౌలభ్యం ప్రకారం బుక్ చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ఏవైనా ఇబ్బందులు ఉన్నాకూడా వాటిని దాటి ప్రయాణాన్ని ఎలాగైనా సరే అందించేలా చేసేందుకు ఒక అద్భుతమైన సరికొత్త అడుగు ఇది. ఈ కొత్త ఫీచర్లో అతిపెద్ద కొత్త విషయమేమిటంటే ఏంటంట కన్ఫర్మ్ కాని టిక్కెట్ కు 3ఎక్స్ వాల్యూ బ్యాక్ వోచర్లు, ఫ్లైట్, క్యాబ్ తదితర వాటి ద్వారా ఖరీదైన చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ బుకింగ్ కు చెల్లించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను తగ్గించడం '' అని ఆయన తెలిపారు.
ఇటీవలే, ఐఆర్సీటీసీ అధీకత రైలు టిక్కెట్ బుకింగ్ భాగస్వామి అయిన గోయిబిబో కూడా ఉచిత రద్దు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది చార్ట్ తయారీకి ముందు బుకర్ టిక్కెట్ను రద్దు చేసినట్టయితే ప్రయాణీకుడు పూర్తి వాపసు పొందేందుకు వీలు కల్పిస్తుంది.