Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హుజూరాబాద్ నుంచి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ కేంద్రం నుంచి ఏం ప్యాకేజీ తెస్తారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటలకు ప్రచారం చేసిన బీజేపీ నాయకులు ముందుగా రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి భారతీయ జనతా కాంగ్రెస్ గా మారి టీఆర్ఎస్ ను ఓడించారని విమర్శించారు. నైతిక విజయం టీఆర్ఎస్ దేనని తెలిపారు. ఈటల, రేవంత్ కుమ్మక్కయ్యారనీ, కొనడం, అమ్మడం రేవంత్ కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఈటల రాజేందర్ తప్పులు చేసి టీఆర్ఎస్ పార్టీని వీడారని తెలిపారు.