Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనారిటీ శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతియేటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హజ్ యాత్రకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ మైనారిటీ శాఖ తెలిపింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ కార్యనిర్వహణాధికారి షఫీయుల్లా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబరు ఒకటో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని తెలిపారు. దరఖాస్తులను వచ్చే జనవరి, 31వ తేదీ వరకూ స్వీకరిస్తామన్నారు. దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారానే చేయాలని సూచించారు. హజ్ కమిటీ వెబ్సైట్ ద్వారా కానీ, హెచ్సీఓఐ మొబైల్ యాప్ ద్వారా కాని దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. దరఖాస్తు చేసుకునే వారు తప్పని సరిగా నిబంధనలు పాటించాలని కోరారు. హజ్ కమిటీ నిబంధనల మేరకు ప్రతిఒక్కరూ తమ పాస్ట్పోర్ట్ ఫోటో, రద్దు చేసిన ఒక చెక్కు, పాస్పోర్ట్ కాపీ, చిరునామా, అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా కానీ, హజ్ కమిటీ వెబ్సైట్లో కానీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్హౌస్లో యాత్రీకులకు ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయనీ, ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునే వీలుందని అధికారులు సూచించారు. హజ్ యాత్ర కోసం ధరఖాస్తు చేసుకునే వారి నుంచి రూ. 300 ప్రాసెసింగ్ ఫీజును తీసుకుంటున్నట్టు తెలియజేశారు.