Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నర్సింగ్ విద్యార్థులకు ఉపకార వేతనాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికార ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఎన్ఏఐ) రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు డాక్టర్ రాజేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సహకరించిన అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నర్సింగ్ డైరెక్టరేట్ కూడా త్వరగా ఏర్పాటు చేయాలి అని ఆమె కోరారు.