Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8న మున్సిపల్ కార్యాలయాల ముట్టడి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పెరిగిన జీతాలను చెల్లించినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో తక్షణమే అమలు చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. దీని కోనం ఈ నెల ఎనిమిదో తేదీన మున్సిపల్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీలో నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. జీవో నెంబర్ 60 విడుదలైనప్పటి నుంచి నేటి వరకు వేతనాలను కేటగిరీ వారీగా అమలు చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. నాలుగు నెలలుగా తమ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు, పోరాటాలు చేస్తూ అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించినప్పటికీ పరిష్కరించరించకపోవడం దారుణమని విమర్శిం చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాల్టీలో 2021 జూలై 24న కార్మికులకు పెరిగిన వేతనాలు చెల్లించారనీ, వరంగల్ కార్పొరేషన్లో మూడు నెలల ఏరియర్స్తో పాటు అక్టోబర్ నెల జీతాన్ని కూడా చెల్లించారని గుర్తుచేశారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న సిబ్బందికి 11వ పీఆర్సీ ప్రకారం వివిధ కేటగిరీల వారీగా వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం నిర్ణయించిన వేతనాలను తక్షణమే మూడు నెలల ఏరియర్స్తో పాటు అక్టోబర్ నెల వేతనాన్ని కూడా చెల్లించాలని కోరారు