Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుమ్మక్కు ఆరోపణపై కాంగ్రెస్ మౌనం
- ఓటమి ఉహించిందేనన్న నేతలు
- బహిరంగ విమర్శలకు దిగిన జగ్గారెడ్డి
- మధ్యలోనే వెళ్లిన జానా, దామోదర
- పీఏసీలో వాడీవేడీ చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హూజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలను కాంగ్రెస్ సీరియస్గా తీసుకోలేదు. ఎప్పటిలాగే ఫలితాల సమీక్షను 'మమ' అనిపించింది. ఉహించిన ఫలితాలే అయినప్పటికీ డిపాజిట్ కోల్పోయిందనే ఆవేదనావ్యక్తం కాలేదు. ఫలితాలపై పార్టీ సీనియర్లు ఎవరికీ వారే బహిరంగంగా విశ్లేషణలు చేస్తున్నారు. ఈ కారణంగా తమ పార్టీ ఓడిపోయిందనే ప్రాథమిక అంచనా కూడా రాలేదు. ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్కు ఓట్ల సంఖ్య పాతాళంలోకి పోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈటల రాజేందర్, కాంగ్రెస్ కుమ్మక్కైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశానికి రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి, సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీ, కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, మహేష్కుమార్గౌడ్, అజారుద్దీన్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల చైర్మెన్ మహేశ్వర్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు రేణుక చౌదరి, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ఓటమి, ఇతర కార్యక్రమాలపై చర్చించారు. బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కు అనే అంశాన్ని అధికార టీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు మౌనం వహిస్తున్నారు. ఓటమిని పక్కదారి పట్టించేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క, రేణుకాచౌదరి మధ్య వాగ్వాదం జరిగినట్టు మీడియాకు లీకులు ఇచ్చారు. సీఎల్పీ నేత జిల్లాలో సమస్యలు సృష్టిస్తున్నారంటూ రేణుకా చౌదరి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఉప ఎన్నికల్లో బలాలు, బలహీనతలపై చర్చించకుండా ఒకరిపై ఒకరు తోసేకునేందుకే ఎక్కువ సమయం కేటాయించినట్టు ఆ వర్గాలు అంటున్నాయి. సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఎప్పుడుపడితే అప్పుడురాననీ, తన అవసరం ఉన్నప్పుడే వస్తా నంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిపింది. ఊరంతా ఒక్కదారైతే ఉలిపికర్రది మరోదారి అన్నట్టు ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహరిస్తున్నారు. పార్టీపై ఏదో కామెంటు చేయడం క్షమా పణ కోరడం అలవాటుగా మారిందని ఆ పార్టీ నేతల్లో అసహ నం వ్యక్తమవుతున్నది. తాజాగా హూజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ను బలిపశువు చేశారంటూ సంచలనల వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థిని ప్రకటించే విషయంలో తమ అభిప్రాయాన్ని చెప్పడంతోపాటు భవిష్య త్తు ఉంటుందంటూ వెంకట్కు చెప్పిన జగ్గారెడ్డి.. ఓడిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్, హూజురాబాద్ ఉప ఎన్నిక ఇంచార్జి దామోదర రాజనర్సింహ సైతం మధ్యలో వెళ్లిపో వడం పలు అనుమానాలకు తావిస్తున్నది. మొత్తంగా ఉప ఎన్నికల్లో ఓటమికి సరైన కారణాలు విశ్లేషించకుండానే సమా వేశాన్ని ముగించారని ఒకనాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.