Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెట్టును ఢకొీన్న కారు.. నలుగురు మృతి
- బాణసంచా కొనేందుకు వెళ్లి వస్తుండగా ఘటన
నవతెలంగాణ-తాడ్వాయి
దీపావళి పండుగ వేళ ఆ ఇండ్లల్లో విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా కొనుగోలు చేసుకొని తిరిగి వస్తుండగా కారు చెట్టును ఢకొీట్టడంతో నలుగురు ప్రాణం కోల్పోయారు. ఘటనా స్థలంలో ఇద్దరు మృతిచెందగా, ఆస్పత్రిలో మరో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ వద్ద బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా కొనుగోలు చేసేందుకు ఎల్లారెడ్డి, పిట్లంకు చెందిన 8 మంది కారులో కామారెడ్డికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్, మోతే రోడ్డుపై కారు అదుపు తప్పి మర్రి చెట్టును ఢకొీంది. దీంతో జగన్(45), శ్రీనివాస్(52), ఆనంద్(28), సుశాంక్(5) చనిపోయారు. వీరిలో ఇద్దరు ఘటనా స్థలంలో, ఇద్దరు ఆస్పత్రిలో మృతిచెందారు. గాయపడిన యశ్వంత్, శ్రీహర్ష, వీరపేట మదాస్, అమర్కాంత్ను 108లో కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వీరంతా బంధువులు. పండుగ వేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది.