Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే ప్రధాన కార్యదర్శి వినయకుమార్
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ఉచిత వైద్యం అందిస్తున్నామని సుందరయ్య విజ్ఞానకేంద్రం ప్రధాన కార్యదర్శి వినయకుమార్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కర్రెమ్మ గుడి దగ్గర ఎస్వీకే ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత మెడికల్ క్యాంపులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ట్రస్టు ద్వారా మెడికల్ క్యాంపులతో పాటు జనరిక్ మెడికల్ షాపుల నిర్వహణ, క్లీనిక్, స్వాఫ్ట్వేర్ కోర్సులు, స్పోకెన్ ఇంగ్లీష్ తదితర వాటిపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో అంటరానితనానికి వ్యతిరేకంగా సుందరయ్య పోరాటాలు చేసి డాక్టర్లను ప్రజా వైద్యులుగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లాలో సుందరయ్య తమ్ముడు వైద్యశాలను ప్రారంభించి నేటికీ డాక్టర్లకు శిక్షణ కొనసాగిస్తున్నారన్నారు. అందులో భాగంగానే వనపర్తిలో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు ఉచితంగా మందులు ఇవ్వనున్నట్టు చెప్పారు. వైద్యులు మురళీధర్ మాట్లాడుతూ.. తన వృత్తి నైపుణ్యానికి సుందరయ్య ఆదర్శమన్నారు. నెల్లూరు ప్రజావైద్యశాలలో శిక్షణ పొంది వనపర్తిలో డాక్టరుగా వైద్యం అందిస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. అక్షర కిరణంతోపాటు అనేక ఉద్యమాలకు సహకరిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జబ్బార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పుట్ట ఆంజనేయులు, వైద్యాధికారులు ఉదరు, శ్రావణి, శేఖర్, గంధం వంశీ, జోష్ణ, చిన్నమ్మ, నాయకులు నాగేశ్వర్, గట్టయ్య, కురుమయ్య, ఎన్.రాములు, మద్దిలేటి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీత, భాగ్యమ్మ పాల్గొన్నారు.