Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామారెడ్డి టౌన్/రామారెడ్డి/నల్లగొండ
వరి కోతలు మొదలై నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అకాలవర్షానికి ధాన్యం రాశులు తడిసిముద్దయ్యాయి. ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపో యింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం అమ్ము కునేందుకు అధికారులు ఇప్పటి వరకూ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రైతులు రోడ్ల మీదికి వచ్చి ఆందోళ నలు చేస్తున్నా ఫలితం లేకపోగా.. వర్షం దెబ్బతీసింది. ధాన్యాన్ని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసి ముద్దవ్వగా, రోడ్ల వెంట ఆరబె ట్టుకున్న ధాన్యం ఈదూరుగాలులతో కూడిన వర్షానికి కొట్టుకుపోయింది. కామారెడ్డిలోని టేక్రియాల్లో జాతీయ రహదారి బైపాస్పై ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. మక్కలతోపాటు వడ్లు కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామారెడ్డి మండలం మద్దికుంట, ఇస న్నపల్లి, రామారెడ్డి, ఉప్పల్వాయి, పోసానిపేట తదితర గ్రామాల్లోని కొనుగోలు కంద్రాల్లో ధాన్యం తడిచి ముద్ద యింది. కొనుగోలు కేంద్రాల్లో తాటిపత్రాలు అందుబాటు లో ఉండక పోవడంతో ధాన్యం రాశులు తడిచాయి. మద్దికుంటలో బండరాయిపై ఆరబెట్టిన ధాన్యం వర్షానికి చెరువులోకి కొట్టుకుపోయింది. మూడ్రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడో ఓ చోట వర్షం పడుతోంది. అర్వపల్లి, తిప్పర్తి, చౌటుప్పల్, గుండాల, మోత్కూరు, రామన్నపేట, పాలకీడు, నల్లగొండ, నేరేడుచర్ల ప్రాంతాల్లో ధాన్యం తడిచింది. ఇంకా రెండు, మూడ్రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.