Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూపకల్పనకు సీఎస్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీ-శాట్ ద్వారా మరింత ప్రజోపయోగ, సమాచార కార్యక్రమాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. సాఫ్ట్ నెట్, టీ.శాట్ కార్యక్రమాలపై బుధవారం బీ.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగిన వర్కింగ్ బాడీ సమావేశంలో సమీక్షించారు. దీనికి బీ.ఆర్. అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.కె. సీతారామారావు, ఎంసీఆర్ హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ హర్ప్రీత్సింగ్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు దివ్య దేవరాజన్, తెలంగాణా టెక్నలాజికల్ సర్వీసెస్ ఎండా వెంకటేశ్వర్ రావు, సాఫ్ట్ నెట్ సీఈఓ శైలేష్రెడ్డి, సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ వ్యవసాయ, విద్యా, మహిళా శిశు సంక్షేమ, యువజన, పంచాయితీరాజ్ శాఖలు తమ విభాగాలకు చెందిన అంశాలపై విజ్ఞానవంతమైన కార్యక్రమాలను రూపొందించి టీ.శాట్ ద్వారా ప్రజలకు అందించాలని సూచించారు.
ప్రధానంగా రైతులకు సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్ ఫామ్ సాగు, హరిత సంపద, పశుపోషణ తదితర అంశాలపై కార్యక్రమాలను రూపొంచాలని సూచించారు. పంచాయితీరాజ్కు సంబంధించి ఉత్తమ సర్పంచులు కావడానికి మార్గాలు, గ్రామ అభివద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామ ఆర్థిక వనరుల పెంపు లాంటి అంశాలు, యువజనులకు సంబంధించి పోటీ పరీక్షలకు తయారీ, కెరీర్ అభివృద్ధి విద్యా పరమైన ప్రావీణ్యత తదితర అంశాలు, పోలీస్ నియామకాలకు సంబందించిన ప్రిపరేషన్, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు, గంజాయి సాగు నిషేధం తదితర అంశాలపై కార్యక్రమాలను రూపొందించాలని సీఎస్ పేర్కొన్నారు. కార్యక్రమాల రూపకల్పన, ప్రసారాలతో పాటు స్వీయ ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. వివిధ శాఖలకు దశ్య, శ్రవణ కార్యక్రమాలను సాఫ్ట్ నెట్, టీ.శాట్ ల ద్వారా రూపొందించాలని సూచించారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలోని పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను అందించడంలో టీ-శాట్ చేసిన కషిని సీఎస్ అభినందించారు.
ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేయాలి : సీఎస్ సోమేశ్ కుమార్
అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులందరిని ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నమోదు ప్రక్రియను సమీక్షించారు. కార్మికులను సిటిజన్ సర్వీస్ సెంటర్లకు తరలించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. సీఎస్ ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీతో పాటు జిల్లా స్థాయిలో కమిటీలు వేయాలని ఆదేశించారు.