Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్యలు తీసుకోవాలి
ఫెడరేషన్ ఎమ్డీకి రజక వృత్తిదారుల సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దోబీ ఘాట్ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో బుధవారం ఆ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి జ్యోతి ఉపేందర్ రాష్ట్ర రజక ఫెడరేషన్ ఎమ్డీకి వినతిపత్రం సమర్పించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 2003లో బీసీ కార్పొరేషన్ నిధులతో దోభిఘాట్ను నిర్మించారని తెలిపారు. దానికి సంబంధించిన స్థలాన్ని ఇటీవల కొంత మంది కబ్జా చేసేందుకు ప్రయత్నించారనీ, ఈ క్రమంలో దోబి ఘాట్ని కూల్చేశారని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యలు రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రజక ఫెడరేషన్ తక్షణమే పరిశీలించి తగు న్యాయం చేయాలనీ, స్థానిక రజకులకు దోబీ ఘాట్ నిర్మించి ఇవ్వాలని పేర్కొన్నారు.