Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేవన్నపేట టోల్ప్లాజా వద్ద రైతుల ఆందోళన
- బలవంతంగా లాక్కుంటే ఊరుకోం : అన్నదాతలు
- సభాస్థలం వద్ద ఉద్రిక్తత
- వెనుదిరిగిన ఎమ్మెల్యేలు, పోలీసులు, ప్రజాప్రతినిధులు
- చేతులెత్తేసిన కుడా, రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-హసన్పర్తి
హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట టోల్ప్లాజా సమీపంలో టీఆర్ఎస్ సభ నిర్వహణకు స్థలం పరిశీలనకు వచ్చిన టీఆర్ఎస్ నాయకులను రైతులు అడ్డుకున్నారు. పంటలు సాగవుతున్న భూ ములను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమనీ, అవసరమైతే తమ ప్రాణాలు తీసుకుంటామని రైతులు తెగేసి చెప్పారు. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 29న సీఎం కేసీఆర్తో 'విజయ గర్జన' సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ సభ ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కుడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పలువురు టీఆర్ఎస్ నాయకులు దేవన్నపేటలో రైతుల భూముల్లో సభ నిర్వహణకు పరిశీలన కోసం వెళ్లారు. కుడా, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంటలకు నష్టపరిహారం అం దించేందుకు అంచనా వేయాలని వారు సూచిం చారు. పంటలున్న వ్యవసాయ భూములను చదును చేసే క్రమంలో అక్కడి రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు లేకుండా బలవం తంగా ఎందుకు చదును చేస్తారో తెలపాలని టీఆర్ ఎస్ నాయకులు, అధికారులను రైతులునిలదీసారు. వెంటనే కాజీపేటఏసీపీ శ్రీనివాస్,హసన్పర్తి,కేయూ, ధర్మసాగర్, కాజీపేట ఇన్సెక్టర్లు, పోలీసు సిబ్బందితో కలిసి ఆందోళనచేస్తున్న రైతులను అడ్డుకునే ప్రయ త్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మార డంతో కుడా, రెవెన్యూ అధికారులతోపాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతి నిధులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు.
మా భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదు : దేవన్నపేట రైతులు
సీఎం కేసీఆర్ సభకు పంటలు వేసిన భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని దేవన్నపేట రైతులు దేవన్నపేట టోల్ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు. కొంత మంది ఎమ్మెల్యే అనుచరులు సభాస్థలం పేరుతో భూములను కబ్జా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సభాస్థలం కోసం పంట పొలాలను తీసుకొని చదును చేయడంవల్ల తిరిగి పంటవేయడానికి పనికిరాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో ప్రకాష్ రెడ్డిపేటలో కేసీఆర్ సభ కోసం స్థలాన్ని సేకరిస్తే ఆ భూవివాదాలు ఇప్పటికీ పరిష్కారం కాకుండా హత్యలకు దారితీసాయని గుర్తుచేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్.. పేద రైతుల భూములను లాక్కొనే కుట్రలను మానుకొని, సభాస్థలాన్ని వ్యవసాయ పంట పొలాలకు దూరంగా నిర్వహించుకునేలా ప్రజాప్రతినిధులకు ఆదేశాలివ్వాలని రైతులు కోరారు.