Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 వరకు వెబ్ఆప్షన్ల నమోదు
- 12న సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. శని, ఆదివారాల్లో ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలనీ, హెల్ప్లైన్ సెంటర్లకు వెళ్లేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈనెల 8న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. 6 నుంచి 9 వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుంది. 12న సీట్లు కేటాయిస్తారు. ఈనెల 12 నుంచి 15 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 12 నుంచి 16 వరకు సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి. తుదివిడతలో సీట్లు పొంది వాటిని రద్దు చేసుకునేందుకు ఈనెల 18 వరకు గడువుంది. ఈనెల 20 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 20, 21 తేదీల్లో వెబ్ఆప్షన్లు నమోదు చేయాలి. 24న సీట్లు కేటాయిస్తారు. ఈనెల 24 నుంచి 26 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 24 నుంచి 26 వరకు సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలి. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను ఈనెల 25న జారీ చేస్తారు. ఇతర వివరాల కోసం https://tseamcet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలి.