Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తొమ్మిది మంది న్యాయవాదులు అబ్దుల్ ముఖీత్ ఖురేషీ, నాగేశ్వరరావు, నారాయణరెడ్డి, ప్రభాకర్, ప్రభాకర చంద్రమౌళి, ప్రతాప్ నారాయణ్ సంఘీ, రామచంద్రరావు, రవీందర్రెడ్డి, వేణుగోపాల్లకు సీనియర్ న్యాయవాదులుగా హైకోర్టు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తుల సమావేశం శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
8 నుంచి తెరుచుకోనున్న కోర్టులు
కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు సహా అన్ని కోర్టుల్లో ఆన్లైన్లో కేసులను విచారించిన న్యాయస్థానం ఈ నెల 8వ తేదీ నుంచి భౌతిక విచారణ చేపట్టనుంది. ప్రతి శుక్రవారం ఆన్లైన్లో కేసుల్ని విచారించే అవకాశాన్ని హైకోర్టు న్యాయమూర్తులకు ఇచ్చింది. జిల్లాల్లోని కరోనా పరిస్థితులను బట్టి కేసులను ఆన్లైన్లో విచారించాల్సి వస్తే అక్కడి చీఫ్ జడ్జిలు హైకోర్టు ద్వారా అనుమతి పొంది అందుకనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు. .
రిటైర్మెంట్ వయస్సు పెంపుపై రిట్లు డిస్మిస్
వేతన సవరణ సంఘం ఇచ్చిన రిపోర్టులోని సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. విరమణ వయస్సు 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతూ చేస్తూ 2021 మార్చి నుంచి అమలుకు వెలువడిన జీవో 45ను సవాల్ చేస్తూ దాఖలైన పలు రిట్లను కొట్టేస్తూ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు చెప్పింది.
పీఆర్సీ కమిటీ 2020 డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం పింఛన్, జీతాలు, గ్రాట్యూటీలను పెంచిన తేదీ నుంచే పదవీ విరమణ వయస్సును కూడా పెంపుదల చేయాలనే పిటిషనర్ల వాదనను కోర్టు తోసిపుచ్చింది, 2018లో టీఆర్ఎస్ సభలో సీఎం, రిపబ్లిక్డే వేడుకల్లో గవర్నర్ ఇచ్చిన హామీల ప్రకారం ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. వయోపరిమితి లేదా పదవీ విరమణ వయస్సు పెంపు అనేది చట్ట సవరణ ద్వారా తీసుకునే నిర్ణయాలనీ, చట్టసభలో పదవీ విరమణ పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని చెప్పింది., జీతాలు మొదలైనవి రాష్ట్రం పెంచిందని చెప్పి అదే మాదిరిగా పదవీ విరమణ పెంపు కూడా అప్పటి నుంచే చేయాలనే విధంగా ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చింది. రాజ్యాంగంలోని 14,16,21 అధికరణాలకు వ్యతిరేకమని పిటిషనర్లు ఆధారాలు చూపలేదని చెప్పింది.