Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాసు సురేష్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ జనగణన జరపకపోతే రాజకీయంగా బీజేపీకి గడ్డుకాలమేనని జాతీయ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.దేశంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయిందని పేర్కొన్నారు. పెరుగు తున్న ధరల పట్ల పేదవారి ఆగ్రహం ఓట్ల రూపంలో కనపడిందని తెలిపారు. పెట్రోల్, డీజిల్, వంటనూనెల ధరలు పెరగటంతో సామాన్యుల బతుకులు భారంగా మారాయని పేర్కొన్నారు.బీసీ జనగణనపై కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలు చేసినా..బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని వివరించారు. దీంతో బీసీల పట్ల ఆ ప్రభుత్వ తీరు అర్థమవుతున్నదని తెలిపారు.