Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురుకుల విద్యాలయాల సంస్థ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆయా విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు విజ్ఞప్తి చేశారు. కొందరు నకిలీ ఏజెన్సీలు అవుట్ సోర్సింగ్ నియామకాలు అంటూ నిరుద్యోగులైన అభ్యర్థులను ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నారని, అలాంటి వాటిని నమ్మవద్దని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థలో నియామకాలు భర్తీ చేయాల్సి ఉంటే ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. ఇలాంటి వార్తల పట్ల నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.