Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ శాఖ ఏఈల విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టును కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై చర్చించేందుకు ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మను విద్యుత్ శాఖ ఏఈల సంఘం ప్రతినిధులు లేఖ రాశారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంతోపాటు అందులో పనిచేసే ఉద్యోగులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావొద్దని వారు ఆ లేఖలో కోరారు. పవర్ ప్రాజెక్టుల్లో ఉన్న ఉద్యోగులు బోర్డు పరిధిలోకి వెళ్తే రెండు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటాయని వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కేంద్రాలు పంపింగ్ మోడ్లో ఉండనికారణంగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావనీ, కానీ తెలంగాణలో ఆ తరహా సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని వారు విజ్ఞప్థి చేశారు. తెలంగాణ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ల అసోసియేషన్ ప్రధానకార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాసిన లేఖను విడుదల చేశారు.