Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం
- 24న సీట్ల కేటాయింపు
- షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్డబ్ల్యూ తదితర డిగ్రీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేశారు. శనివారం నుంచి ఈనెల 20 వరకు రూ.400 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్తోపాటు వెబ్ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశముందని తెలిపారు. ప్రత్యేక కేటగిరీ (వికలాంగులు, క్యాప్, ఎన్సీసీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్) విద్యార్థులకు ఈనెల 18న విశ్వవిద్యాలయాల్లోని హెల్ప్లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. ఈనెల 24న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. 24 నుంచి 26 వరకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టం ఆధారంగా వివరాలు నమోదు చేసి సీట్లు పొందాలని సూచించారు. ఈనెల 24 నుంచి 26 వరకు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. ఈనెల 27 నుంచి 29 వరకు ఇంట్రా కాలేజీ (అదే కాలేజీలో మాధ్యమం, కోర్సు మారేందుకు అవకాశం) ప్రత్యేక విడత కౌన్సెలింగ్ జరుగుతుందని వివరించారు. 30న ఇంట్రా కాలేజీ సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు http://dost.cgg.gov.in వెబ్సైట్ను చూడాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే వాట్సాప్ ద్వారా 7901002200 నెంబర్ను సంప్రదించాలని కోరారు.
దోస్త్ ప్రత్యేక విడత షెడ్యూల్
రిజిస్ట్రేషన్ ఈనెల 6 నుంచి 20 వరకు
వెబ్ఆప్షన్ల నమోదు ఈనెల 6 నుంచి 20 వరకు
సీట్ల కేటాయింపు ఈనెల 24
సెల్ఫ్ రిపోర్టింగ్ ఈనెల 24 నుంచి 26 వరకు