Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురపాలకసంఘాలకు సర్కారు ఉత్తర్వులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో ఇండ్ల స్థలాల వివరాలన్నింటినీ మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ పురపాలకశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు, ఇండ్లస్థలాల క్రమబద్ధీకరణ, గ్రామకంఠాలు, సీలింగ్ భూములు, 2008, 2014 నాటి ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల వివరాలివ్వాలని పేర్కొన్నారు. అలాగే అసైన్డ్ భూములు, పట్టాలు ఇచ్చినా, ఇప్పటికీ ప్రభుత్వ భూములుగానే రికార్డుల్లో చూపుతున్న వివరాలను అందించాలని తెలిపారు. దేవాదాయ, వక్ఫ్, అటవీ, ఇతర శాఖలకు చెందిన భూముల వివరాలు, కోర్టు కేసులు ఉన్న భూముల వివరాలు, లీజుకు ఇచ్చిన భూముల వివరాలు అన్నింటినీ ఆయా పురపాలక సంఘాల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.