Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 151 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 33,226 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 29,958 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 3,268 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 944 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,838 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 45 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా రెండు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో తొమ్మిది జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
18 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో గురువారంతో పోలిస్తే శుక్రవారం 18 జిల్లాల్లో కేసులు పెరిగాయి. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మేడ్చల్ - మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల,రంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు పెరిగాయి.
10 జిల్లాల్లో తగ్గిన కేసులు
జీహెచ్ఎంసీతో సహా భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి.