Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్, డీజిల్ ధరలు టీడీపీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ట్రంలోనూ తగ్గించాలని తెలుగుదేశం తెలంగాణ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదలచేశారు. గత ఏడాది కాలంగా దాదాపు లీటర్పై రూ. 38 పెంచి, ఇప్పుడు పెట్రోల్పై రూ. 5, డీజిల్పై రూ. 10ని మాత్రమే కేంద్రం తగ్గించడం సరికాదన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం విధించిన ఎక్సైజ్ సుంకాన్ని మరింత తగ్గించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో భారీ వర్షాలతో రైతులు పంటలు నష్టపోగా, పండించిన కొద్దిపాటి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కేవలం 1,500 కేంద్రాలకే పరిమితం చేసి కొనుగోళ్లను నియంత్రిస్తున్నారని విమర్శించారు. ధాన్యం కేంద్రాల వద్దకు వచ్చి 15 రోజులవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే పూర్తిస్థాయిలో కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వ అశ్రద్దగా మూలంగా రైతులు మానసిక వేదనకు గురై చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.