Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీఏలో 2,141 సీట్లు
- నేటినుంచి ఐసెట్ ధ్రువపత్రాల పరిశీలన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ కోర్సులో 22,191 సీట్లు, ఎంసీఏ కోర్సులో 2,141 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా శనివారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ షెడ్యూల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంబీఏ కోర్సుకు సంబంధించి 22 వర్సిటీ కాలేజీల్లో 1,518 సీట్లు, 238 ప్రయివేటు కాలేజీల్లో 20,673 సీట్లు కలిపి మొత్తం 260 కాలేజీల్లో 22,191 సీట్లున్నాయని తెలిపారు.
ఎంసీఏకు సంబంధించి 14 వర్సిటీ కాలేజీల్లో 730 సీట్లు, 26 ప్రయివేటు కాలేజీల్లో 1,411 సీట్లు కలిపి మొత్తం 40 కాలేజీల్లో 2,141 సీట్లున్నాయని పేర్కొన్నారు. ఈనెల 6 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. అదేనెల 6 నుంచి 11 వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశముందని పేర్కొన్నారు. ఈనెల 14న సీట్లు కేటాయిస్తామని వివరించారు. శుక్రవారం వరకు ప్రాసెసింగ్ ఫీజు 10,959 మంది అభ్యర్థులు చెల్లించారని వివరించారు. ఇతర వివరాలను ష్ట్ర్్జూర://్రఱషవ్.అఱష.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.