Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు పంట కోసినా ఇప్పటి వరకు వాటిని ఏర్పాటు చేయకపోవడం దారుణమని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. సూర్యాపేట జిల్లాతోపాటు అనేక ప్రాంతాల్లో వరి ధాన్యాన్ని రోడ్ల మీద ఎండబెడుతున్నారని తెలిపారు. రైతులకు టోకెన్లు జారీ చేయటం ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేసే దుస్థితికి నెట్టబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.