Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహితి
హైదరాబాద్: పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ సాహిత్యవేత్త, విద్యావేత్త జలజం సత్యనారాయణ (82) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. జలజం మరణం సాహిత్యలోకానికి, విద్యారంగానికి తీరనిలోటని తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వల్లభాపురం జనార్థన, కె.ఆనందాచారి అన్నారు. ఆయన పలు హిందీ, ఆంగ్ల పుస్తకాలను తెలుగులోకి అనువదించడమే కాకుండా పలు సాహిత్య కార్యక్రమాల నిర్వహణలో పాలుపంచుకున్నారు. అభ్యుదయ, ప్రజాతంత్ర ఉద్యమాలతో మమేకమై పనిచేసిన జలజం మృతి సాహిత్య రంగానికి తీరని లోటని వారు తెలిపారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ సంతాపం
కవి, రచయిత, అనువాదకులు జలజం సత్యనారాయణ మృతి పట్ల హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు జూలూరు గౌరీశంకర్, కోయ చంద్రమోహన్లు సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి, తెలంగాణ సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబానికి సానుభూతిని తెలిపారు.