Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బు, మద్యం, దౌర్జన్యం నమ్ముకున్నాడో వాటికే బలవుతాడు
- మంత్రి హరీశ్రావుపై ఈటల ఫైర్
నవతెలంగాణ-సిద్దిపేట
నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తానని మంత్రి హరీశ్రావు అబద్దపు మాటలు నమ్మబలికాడనీ, ప్రజలు నమ్మి ఓటు వేస్తే.. నేడు ఆయన అధర్మం, అన్యాయం, దౌర్జన్యం పక్షాన నిలబడ్డాడని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. గురువారం కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈటలకు రంగదాంపల్లి అమరవీరుల చౌరస్తా వద్ద సిద్దిపేట బీజేపీ శ్రేణులు, ముదిరాజ్ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి మాట్లాడారు. హరీశ్రావు ఏ కుట్రలు, డబ్బు, మద్యాన్ని, దబాయింపులను నమ్ముకున్నాడో.. వాటికే ఆయన బలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. దళితబంధును తెలంగాణ అంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో కూడా దళిత గర్జన పెట్టే రోజు వస్తుందనీ, దానికి తానే నాయకత్వం వహిస్తానని తెలిపారు. ప్రగతి భవన్లో కూర్చున్న కేసీఆర్కు, సిద్దిపేటలో కూర్చోని కుట్రలు చేసిన హరీశ్రావుకు హుజూరాబాద్ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్రెడ్డి, ముదిరాజ్ సంఘం నాయకులు వేణుగోపాల్, విద్యాసాగర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.