Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 750 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం
- సింగరేణి సీఎమ్డీ ఎన్ శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
వచ్చే ఏడాది మార్చి నాటికి సింగరేణి ఆధ్వర్యంలో నూతన ఓపెన్కాస్ట్ గనుల్ని ప్రారంభించుకోవాలని ఆ సంస్థ సీఎమ్డీ ఎన్ శ్రీధర్ చెప్పారు. దీనికి సంబంధించిన అనుమతులు, టెండర్లు, ఇతర పనులన్నింటినీ సకాలంలో పూర్తిచేసి, వచ్చే ఏడాదికి 750 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన సంస్థ డైరెక్టర్లు ,సలహాదారులు, ఏరియా జనరల్ మేనేజర్ల తో శుక్రవారం ఆన్లైన్ ద్వారా ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది చివర్లో ఉత్పత్తిని ప్రారంభించనున్న జీడీకే ఓపెన్ కాస్ట్ గని, ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్, ఉత్పత్తి సామర్థ్యం పెంపుదలతో జేవీఆర్ ఓపెన్ కాస్టు -2 తో పాటు 2022-23లో మరో 5 ఓపెన్ కాస్ట్ గనులను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వీటిలో కొత్తగూడెం ఏరియాలో వీకే ఓపెన్ కాస్ట్ గని, రామగుండం ఏరియాలో ఆర్జీ ఓసీ గని, బెల్లంపల్లి ఏరియా లో గోలేటి ఓసీ గని, ఎంవీకే ఓపెన్ కాస్ట్ గని, ఇల్లందు ఏరియాలో రొంపెడు ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయనీ, వాటి ద్వారా తొలి ఏడాది సుమారు 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు వివరించారు. అనుమతులు , భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలు పరిష్కరించుకోవాలనీ, గనులకు కావాల్సిన యంత్రాల కొనుగోలు, ఓవర్ బర్డెన్ తదితర పనులకు కాంట్రాక్ట్ ఏజెన్సీల నియామకం వంటివి పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు, గనులకు పేలుడు పదార్థాల సరఫరా చేసే సంబంధిత కంపెనీలతోనూ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్( ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ , పా ) ఎన్ బలరాం, డైరెక్టర్ (ఇ అండ్ ఎం) డి సత్యనారాయణరావు ,అడ్వైజర్లు డీఎన్ ప్రసాద్ (మైనింగ్), సురేంద్ర పాండే (ఫారెస్ట్రీ), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జే ఆల్విన్తో పాటు పలువురు జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.