Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులను ఆదేశించిన సీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు సాగుదారుల నుంచి క్లయిమ్లను స్వీకరించేందుకు ఆవాసాల వారీగా సరిపడా ఫారమ్-ఏలను అందుబాటులో ఉంచాలనీ, వాటిని పూర్తి చేసి దరఖాస్తులను అందజేసేందుకు గ్రామస్తులకు తగినంత సమయమివ్వాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. గ్రామాల్లో ఈ నెల 8వ తేదీ నుంచి క్లయిమ్ల స్వీకరణ, అవగాహనా కార్యక్రమాలను ప్రారంభించాలన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని బీఆర్కేభవన్ నుంచి పోడు భూముల సమస్య పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ సోమేశ్కుమార్ కలెక్టర్లు, డీఎఫ్ఓలు, అదనపు కలెక్టర్లు, డీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్ఆర్సీలతో పాటు గ్రామ పంచాయతీ, మండల, డివిజన్, జిల్లా స్థాయి బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో భాగంగా మొదటగా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. క్లయిమ్ల స్వీకరణపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేశామని తెలిపారు. పోడు భూములపై గ్రామస్తులకు అవగాహన కల్పించి, పూర్తి చేసిన క్లయిమ్లు స్వీకరించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆవాసాల వారీగా గ్రామ పంచాయతీ స్థాయి బృందాలు, ఎఫ్ఆర్సీలు గ్రామస్తుల నుంచి పూర్తి చేసిన క్లయిమ్లను సీఎస్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్ శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా జడ్ చొంగ్తు, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్, అడిషనల్ పీసీసీఎఫ్లు ఎన్.సి పరాజిన్, స్వర్గం శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.