Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టపాసులు పేల్చుతుండగా ప్రమాదాలు
- సరోజినిదేవి ఆస్పత్రికి 32 మంది బాధితులు
- ఐదుగురికి సీరియస్
నవతెలంగాణ-సిటీబ్యూరో
వెలుగులు పంచాల్సిన దీపావళి పండుగ పలువురికి చీకట్లు మిగిల్చింది. పండుగ సందర్భంగా టపాసులు పేల్చే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. గురు, శుక్రవారాల్లో 32 మంది సరోజినిదేవి కంటి ఆస్పత్రికి వెళ్లారు. వీరిలో 8 మంది చికిత్స పొందుతున్నారు. ఒకరి పరస్థితి సీరియస్గా ఉంది. దీపావళి రోజున బాణా సంచా (క్రాకర్స్) కాల్చేందుకు పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. కానీ చిన్నపాటి అలసత్వం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. పలుచోట్ల బాణసంచా ప్రమాదంలో 50 మందికి గాయాలయ్యాయని సమాచారం. బాధితులు మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రితోపాటు పలు ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో పలువురి కంటికి గాయాలు కావడంతో సరోజిని కంటి ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం నాటికి సరోజిని కంటి ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 32కు చేరిందని డాక్టర్లు తెలిపారు. కొందరు చిన్న చిన్న గాయాలతో చికిత్స కోసం ఆస్పత్రికి రాగా, మరికొందరు పెద్దగాయలతోనే వచ్చినట్టు తెలిపారు. అయితే, గురువారం 27 మంది కంటి ఆస్పత్రికి వచ్చారు. వీరిలో 22 మంది అవుట్ పేషెంట్లుగా ఉన్నారు. ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఇద్దరు పెద్దలకు డాక్టర్లు ఆపరేషన్లు చేశారు. ముగ్గురు పిల్లలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. శుక్రవారం 10 మంది బాధితులు ఆస్పత్రికి వచ్చారు. వీరిలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఒకరికి కంటిచూపు రావడం కష్టమేనని, వారం రోజుల తర్వాత స్పష్టత వస్తుందని ఆర్ఎంఓ తెలిపారు.