Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాసు సురేష్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చమురు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పన్నుల మోత మోగిస్తున్నదనీ, దీంతో పేదల జీవనంపై ఆర్థిక భారం పెరుగుతున్నదని జాతీయ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకే దేశం - ఒకే విధానమంటున్న బీజేపీ ప్రభుత్వం భారత దేశంలో అన్ని వస్తు సేవలపై అమలవుతున్న జీఎస్టీ విధానాన్ని పెట్రో ఉత్పత్తులకు మాత్రం ఎందుకు వర్తింపజేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు .
పెట్రోల్ , డీజిల్, వంటగ్యాస్ ధరలు భారీగా పెరగడంతో కూరగాయలు, నిత్యావసర సరుకులు రేట్లు విపరీతంగా పెరిగాయని తెలిపారు. పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గించి, ప్రాంతీయ పార్టీలను రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్నారని తెలిపారు.