Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయాలకతీతంగా రోడ్డెక్కిన గిరిజనేతరులు
- రైతుబంధు, రైతు బీమా వర్తింపజేయాలి
నవతెలంగాణ-కొత్తగూడ
50-60 ఏండ్లుగా పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమకు హక్కు పత్రాలివ్వకపోతే తామెలా బతకాలని ఏజెన్సీ గిరిజనేతరుల రైతు సేవా సంఘం ప్రతినిధులు చల్లా నారాయణరెడ్డి, దేశిడి శ్రీనివాస్రెడ్డి,గజ్జి రామన్న, సుంకరబోయిన మొగిలి, కొమ్మనబో యిన వేణు, బిట్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలిచ్చి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన గిరిజనేతర రైతులందరికీ పోడు సాగు భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో రాజకీయాలకతీతంగా మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండల కేంద్రంలో శనివారం భారీ ర్యాలీ చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి, తహసీల్దార్ చందా నరేష్కు వినతిపత్రాలు అందించారు.