Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
స్వయానా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండి పెట్టారు. వర్కర్లు లేకపోవడంతో ఆయనే రంగంలోకి దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా గ్రామంలో జరిగింది.వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ తండా ప్రాథమికోన్నతి పాఠశాలలో 48మంది విద్యార్థులున్నారు. కరోనా అనంతరం పాఠశాలలు పున:ప్రారంభం కాగా.. ఆనాటి నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేదు. పెరిగిన ధరలతో వర్కర్స్ ఎవరూ ముందుకు రావడం లేదు. స్థానిక సర్పంచ్ ప్రయత్నం చేసినా ఫలితం లేదు.ప్రస్తుత పరిస్థితిని మండల విద్యాశాఖ అధికారికి సమాచారం అందించారు.దీంతో స్పందించిన ఎంఈవో తక్షణమే పాఠశాలకు వెళ్లి తనిఖీ చేశారు.మధ్యాహ్న భోజనం వర్కర్లతో మాట్లాడా రు. వారు నిరాకరించడంతో ప్రధానోపాధ్యాయుడితో కలిసి పొయ్యి వెలిగించి వంట మొదలుపెట్టారు. విద్యార్థులు చూస్తుండగానే వంట లు పూర్తి చేశారు. ఎంఈవో వెంకట రామాచారి స్వయంగా బియ్యం కడిగి పొయ్యిమీద పెట్టి వండి వడ్డించారు.