Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎమ్డీ ఎన్ శ్రీధర్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సింగరేణి కాలరీస్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఏడు నెలల్లో రూ. 14,067 కోట్ల టర్నోవర్ సాధించి, రూ.868 కోట్ల లాభాలను ఆర్జించిందని ఆ సంస్థ సీఎమ్డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. శనివారంనాడాయన బొగ్గు గనుల ప్రగతి, ఆర్థిక విషయాలను సమీక్షించారు . గత ఏడాదితో పోలిస్తే 177శాతం వద్ధి సాధించినట్టు తెలిపారు. అలాగే బొగ్గు అమ్మకాల్లో 78 శాతం, విద్యుత్ అమ్మకాల్లో 18 శాతం వద్ధి సాధించామన్నారు. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 68 శాతం వద్ధితో 367 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేశామనీ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా ఈ ఏడాది అక్టోబర్ నాటికి 5,291 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్ర అవసరాలకు అందించినట్టు వివరించారు.