Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. నేనేంటో చూపిస్తానని తెలిపారు. శనివారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మాజీ ఎంపీ వి హనుమంతరావుతో భేటీ అయ్యారు. అనంతరం కోమటిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన ప్రాణమనీ, సోనియాగాంధీ తన దేవత అన్నారు. తమ పార్టీ నేతలే సోనియాను అప్పుడు దయ్యం అనీ, ఇప్పుడు దేవత అంటున్నారని చెప్పారు. పెద్ద లీడర్లమని చెప్పుకుని పదవులు పంచుకున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో 72- 78 సీట్లు వస్తాయంటూ ముఖ్యమంత్రి, మంత్రులు పదవులు పంపకాలు చేసుకున్నారని ఆరోపించారు.