Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ రుణాల పంపిణీని వేగవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. '2020-21 కార్యచరణ ప్రణాళిక అమలుపై' మాసబ్ ట్యాంక్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృత్తి నైపుణ్యంతో సంబంధం లేని రుణాలను నెలాఖరులోగా ఇవ్వాలనీ, నైపుణ్యానికి సంబంధించిన రుణాలను డిసెంబర్ చివరి నాటికి ఇవ్వాలని సూచించారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్యచరణ ప్రణాళికలో ఏయే అంశాలను చేర్చాలో ఖరారు చేయాలని చెప్పారు. ఈ నెలాఖరులో కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. దళితుల సంక్షేమం, ఉన్నతి, రుణ ప్రణాళిక అమలు, ఉపకార వేతనాలు, వసతి గృహాల నిర్వహణ, స్టడీ సర్కిళ్లను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం, వచ్చే బ్యాంకర్ల సమావేశంలో ఎస్సీల సముద్ధరణకు సంబంధించిన అంశాలను చేర్చడం తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించనున్నట్టు చెప్పారు.