Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీలో చేరేందుకు సన్నాహాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యమవుతుందన్న ప్రచారం జరుగుతున్నది. ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశం ఉందనట్టు ఆయా వర్గాల్లో వినిపిస్తున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన తర్వాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజగోపాల్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గ అభివద్ధి కోసం రూ2వేల కోట్లు కేటాయిస్తే తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఇటువంటి వ్యాఖ్యలతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదంటూ, టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్నామ్నాయ మంటూ వ్యాఖ్యానించి దుమారంలేపారు. ఇప్పటికే ఆయన కొన్ని నెలలుగా మౌనంగా ఉంటూ పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. హుజూరా బాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తన అస్త్రశస్త్రాలను ప్రయోగించినా...బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.