Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసినందున ఆ నియోజకవర్గంలోని అర్హులైన వారు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధకారి డాక్టర్ శశాంక్ గోయల్ పేర్కొన్నారు. 2022 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండే వారు ఓటరు గుర్తింపు కార్డులకు దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఉప ఎన్నిక వల్ల ఈ నియోజకవర్గంలో ఓటరు నమోదు ఆలస్యంగా ప్రారంభమైనట్టు వివరించారు. ఈనెల 6, 7, 27, 28 తేదీల్లో బూత్ స్థాయిలో ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఓటర్ల జాబితాలో సవరణలు కూడా చేసుకోవచ్చన్నారు.