Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీచర్లు లేనందున తన నియోజకవర్గం పరిధిలోని 11 జిల్లాల్లో బోధన కుటుంపడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు మళ్లీ ప్రయివేటు స్కూళ్లలో చేరుతున్నారని తెలిపారు. గతంలో మాదిరి ఈ విద్యాసంవత్సరానికి కూడా తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయిలో సర్దుబాట్లు చేయట్లేదనీ, రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదనీ, సమ్మేటివ్ పరీక్షను నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. ఉపాధ్యాయులు, ఇతర సమస్యలపై విద్యాశాఖ మంత్రి సమీక్ష నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయాలనీ, విద్యాశాఖ దీనిపై కూడా దృష్టి సారించాలని సూచించారు.