Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజినీరింగ్ ప్రవేశాల తుది విడత కౌన్సెలింగ్ షురూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ బీటెక్ ప్రథమ సంవత్సరంలో కన్వీనర్ కోటాలో కొత్తగా 4,404 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్)లో 1,533సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటాసైన్స్లో 840సీట్లు, సీఎస్ఈ (డాటాసైన్స్)లో 672 సీట్లు, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 546 సీట్లు, సీఎస్ఈ (సైబర్ సెక్యూరిటీ)లో 231సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లో 168 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్లో 168 సీట్లు, ఈసీఈలో 126 సీట్లు, సీఎస్ఈ (ఐవోటీ)లో 42 సీట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈఈఈ, సివిల్లో 21 సీట్ల చొప్పున, మైనింగ్ ఇంజినీరింగ్లో 15 సీట్లు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఇంజినీరింగ్ ప్రవేశాల తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైందని తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు 1,481 మంది అభ్యర్థులు చెల్లించారనీ, స్లాట్ బుక్ చేసుకునేందుకు ఆదివారం వరకు గడువుందని పేర్కొన్నారు. సోమవారం ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. 7,124 మంది అభ్యర్థులు వెబ్ఆప్షన్లు నమోదు చేశారని తెలిపారు. ఈనెల 12న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.