Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నిక చేదు అనుభవం నుంచి కోలుకునేందుకు అధికార టీఆర్ఎస్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నది.ఇందులో భాగంగా కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్...మరో అంకానికి తెరలేపారు.ఒకవైపు ఈనెల 26న వరంగల్లో విజయగర్జన సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లను నిర్వహిస్తుండగా, మరోవైపు ఇప్పటికే ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ పోస్టులను భర్తీ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసినట్టు వినికిడి.తాజాగా ఆయా పేర్లు సామాజి క మాధ్యమాల్లో చక్కర్లు కొట్టటం గమనార్హం. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ సిరికొం డ మధుసూదనాచారితోపాటు రవీంద ర్రావు, పాడి కౌశిక్రెడ్డి, కోటిరెడ్డి, ఎల్.రమణ, గవర్నర్ కోటాలో గుత్తా సుఖేందర్రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండటం గమనార్హం.