Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకు నోెటిఫికేషన్ వెలువడింది. ఈ నెలతో మద్యం దుకాణాల లైసెన్స్ గడువు పూర్తికానుంది. 2021-2023 రెండేండ్ల కాలపరిమితికిగాను కొత్త నోటిఫికేషన్ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలున్నాయి. ఆదాయాన్వేషణలో భాగంగా మద్యం ధరలను సవరించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈసారి దళితులు, గిరిజనులు, గౌడ్లకు కూడా దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముంది. పాత విధానం ప్రకారం దరఖాస్తు రుసుం రూ.లక్ష ఉన్నప్పుడు 2017లో 2,216 దుకాణాలకు 41,999 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి సుమారు రూ.411కోట్ల ఆదాయం సమకూరింది.అయితే, 2019లో దరఖాస్తు రుసుమును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచడంతో ఆదాయమూ రెట్టింపైయింది.2019లో 44వేలకుపైగా దరఖాస్తులు రాగా.. రూ.880 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది.ఈసారి రూ.1000కోట్లకుపైగా ఆదాయం రాబట్టే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి చేసిన దరఖాస్తులను 16లోగా సమర్పించాలి. 18న డ్రా తీసి, 20వరకు దుకాణాలకు లైసెన్స్లు జారీ చేయనున్నారు. లాటరీలో రాకపోతే ఆ రూ.2 లక్షలు పోయినట్టే.
ఆరు శ్లాబులు
2011 జనాభా గణన ప్రాతిపదికన లైసెన్స్ ఫీజుల్ని ఖరారు చేస్తూ 2019లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగు శ్లాబులకు బదులు కొత్తగా ఆరు శ్లాబుల్లో లైసెన్స్ రుసుముల్ని ఖరారు చేసింది.