Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- నల్లగొండ, మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్లు పరిశీలన
నవతెలంగాణ-నల్లగొండ, మిర్యాలగూడ
'ప్రజలంద రూ ఆర్టీసీని ఆదరించాలి. ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలి' అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. శనివారం ఆయన నల్లగొండ, మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్లను పరిశీలించారు. బస్టాండ్లలో ఉన్న దుకాణాలను తనిఖీ చేశారు. ఆర్ఎం కార్యాలయాల్లో రికార్డులను తనిఖీ చేశారు. బస్టాండ్ ఆవరణలో తిరుగుతూ మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలను ప్రయాణికులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బస్సు ఎక్కి ప్రయాణికులతో ముచ్చటించారు. మిర్యాలగూడ బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. నల్లగొండ బస్టాండ్లో కార్గో సేవలను పరిశీలించారు. అక్కడే ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లా డుతూ..ఆర్టీసీపైప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. ప్రయాణికుల సంక్షేమం కోసం ఆర్టీసీ కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. సిబ్బంది నిజాయితీగా పని చేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరా రు.ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ బస్సులో ప్రయాణించే విధంగా వారిని ప్రోత్సహించాలని కోరారు. ఆయన వెంట నల్లగొండ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హైదరాబాద్ కరీంనగర్ జోన్ ఈడీ మునిశేఖర్, మిర్యాలగూడ రీజినల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, మిర్యాలగూడ టూటౌన్ సీఐ సురేష్, డిపో మేనేజర్ పాల్, సిబ్బంది ఉన్నారు.