Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దిపేట - హన్మకొండ రహదారిపై రాస్తారోకో
నవతెలంగాణ-నంగునూరు
వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి రైతులు రోడ్డెక్కారు.నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ సిద్దిపేట-హన్మకొండ రహదారిపై శనివారం రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..15 రోజుల కిందట వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అధికారులు, ప్రజాప్రతినిధులు నేటికీ ఒక్క ధాన్యం గింజా కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న రాజగోపాల్ పేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. దానికి రైతులు ససేమిరా అనడంతో మార్కెట్ కమిటీ చైర్మెన్ రాగుల సారయ్యతో ఎస్ఐ ఫోన్లో మాట్లాడించారు. రెండు, మూడు రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చైర్మెన్ హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.