Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం అరకొర తగ్గింపులు సరిపోవు: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెట్రోల్, డీజిల్పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరకొర తగ్గింపులు సరిపోవని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమూ వ్యాట్ను తగ్గించాలని శనివారం ఒక ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీతో పాటు, ఇతర సెస్సులు అడ్డగోలుగా పెంచి పేదలకు అందుబాటులో లేకుండా చేసిందని విమర్శించారు. వాటి ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలూ అడ్డూఅదుపు లేకుండా పెరిగి పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థికస్థితి మరింత దిగజార్చేలా చేసిందని తెలిపారు. వాటి ధరలు స్థిరంగా ఉండేందుకు గతంలో మాదిరిగా ఆయిల్పుల్ ఖాతాను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనీ, వాటిపై విధిస్తున్న అన్ని రకాల సెస్సులనూ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై తన వంతు వ్యాట్ను తగ్గించటం ద్వారా వినియోగదారులకు కొద్దిమేరకైనా ఊరట కల్గించాలని కోరారు. దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీ ఓడిపోవడంతో 2022లో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలను దష్టిలో పెట్టుకుని లీటర్ పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 ఎక్సైజ్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని వివరించారు. రాష్ట్రాలూ ట్యాక్స్ను తమ వంతుగా కొంత తగ్గించి ప్రజలకు ఊరట కల్గించాలని సూచించిందని తెలి పారు. దీంతో ఇప్పటికే 22 రాష్ట్రాలు ధరలు కొంతమేర తగ్గించినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడం శోచనీయమని విమర్శిం చారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వమూ లీటర్ పెట్రోల్పై రూ.7, డీజిల్పై రూ.10/-లు వ్యాట్ తగ్గించి ప్రజలపై కొంతమేర భారం తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.