Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ వానాకాలం ధాన్యాన్ని మాత్రమే కొంటాం
- పంటల కొనుగోళ్లలో బీజేపీకి విధానమేదీ : మంత్రి నిరంజన్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాసంగిలో రైతులు వరి సాగు చేయొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. ఒకవేళ సాగు చేసినా ఆ ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనబోదని స్పష్టం చేశారు. వరి సాగు చేయాలనుకునే రైతులు, మిల్లర్లతో ఒప్పందం చేసుకున్న తర్వాతనే వరినారు పోసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న ఆశతో మాత్రం సాగు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వ విధాన నిర్ణయమని పేర్కొన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను వేయాలని సూచించారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్తో కలిసి మంత్రి విలేకర్లతో మాట్లాడారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నానా యాగీ చేస్తున్నదన్నారు. కేంద్రం చేతగానితనాన్ని రాష్ట్రాల మీద నెట్టివేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనమన్నారు. దేశంలో పంటల కొనుగోళ్ల విషయంలో బీజేపీకి ఒక విధానమంటూ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది అబద్ధమైతే, యాసంగి కొనుగోళ్లు చేస్తామంటూ ఆపార్టీ ఎంపీలు కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. భారత ఆహారరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేకుట్రలో భాగంగా కేంద్రం కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకుంటుందని విమర్శించారు. వానాకాలానికి సంబంధించి కల్లాలోకి వస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. దొడ్డు వడ్లయినా, సన్నాలు అయినా సరే ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. వడ్లు కొనుగోలు విషయంలో రైతులు బాధపడొద్దని విజ్ఞప్తి చేశారు. వానాకాలం వరి ధాన్యాన్ని ఎఫ్సీఐ కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని భరోసా ఇచ్చారు. యాసంగిలో నూక శాతం ఎక్కువ ఉంటుందనీ, నూక లేని వరి వంగడాల అభివద్ధి కోసం కషి చేస్తున్నట్టు తెలిపారు. రైతులపట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని ఎవరూ శంకించలేరని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కషి ఫలితంగానే రాష్ట్రంలో పంటల సాగు పెరిగిందనీ, తద్వారా పంటల దిగుబడులు ఆశాజనంగా ఉన్నాయని పేర్కొన్నారు. ధాన్యాన్ని కొనే విషయంలో రైతులను రెచ్చగొట్టి విపక్షాలు రాజకీయం లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఆయా పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దని కోరారు. వరి కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రయివేటు మిల్లర్ల వద్ద టోకెన్ సిస్టం ఉందనీ, అది సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకే పరిమితని వెల్లడించారు. కామారెడ్డి మార్కెట్లో అకస్మాత్తుగా రైతు మరణించడం దురదష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ సంఘటనపై నివేదిక కోరినట్టు తెలిపారు.