Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల
నవతెలంగాణ-చండూరు
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ ఇదేనా అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం 19వ రోజు నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామం నుంచి తాస్కానిగూడెం మీదుగా కొనసాగింది. ఉదయం పది గంటలకు ప్రారంభమైన పాదయాత్రలో గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగులతో ముచ్చటించారు. వరి, పత్తిరైతులకు అందుతున్న మద్దతు ధర గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు మహిళలు, వృద్ధులు ఘనస్వాగతం పలికారు. బోడంగిపర్తిలో మధ్యాహ్నం మూడుగంటల తర్వాత పాదయాత్ర కొనసాగింది. దాంతో ఆమె గ్రామస్తులను పలకరించుకుంటూ అభివాదం చేసుకుంటూ మాజీ సీఎం వైఎస్ఆర్ బిడ్డగా తనను ఆశీర్వదించాలని కోరారు. మళ్లీ తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఆమె వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.