Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రఘుశంకర్రెడ్డి, టి.లింగారెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలనీ, ఖాళీలను టీఆర్టీ ద్వారా భర్తీ చేయాలనీ, పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలనీ, గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక బిల్లులు గ్రాట్యూటి, లీవ్ ఎన్క్యాష్మెంట్, జీపీఎఫ్, చెల్లింపులు, మెడికల్ బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, గురుకుల పాఠశాలల సిబ్బంది సర్వీస్, వేతన సమస్యలను పరిష్కరించాలని కోరారు.